జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 29 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
చర్యలను ఖండిస్తున్నామని ఇది మానవ హక్కులపై జరిగిన దాడిగా అభివర్ణిస్తున్నామని
విసీ కే పార్టీ పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి వంజా జాన్ ముత్తయ్య తెలిపారు, వారు ఈరోజు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో రాజ్యాంగం ప్రకారం ప్రజల అన్ని హక్కులకు భద్రత కల్పించాల్సినటువంటి పోలీసు వ్యవస్థలోని ఒకరిద్దరు అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటి అని ప్రశ్నించారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ ను చాలా స్టేషన్లలో అమలు చేస్తున్నారని, కానీ ఒకటి రెండు చోట్ల ఇలా జరగడం బాధాకరమన్నారు, గత ప్రభుత్వంలో కూడా దళితులపై పేదలపై ఇలాంటి దాడులు చాలా జరిగాయని, దాని ఫలితం ఆ ప్రభుత్వం చవిచూసిందన్నారు,ఇలాంటి చర్యల వల్ల ప్రభుత్వంపై,పోలీస్ డిపార్ట్మెంట్ పై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుందని తెలిపారు, దేశంలోని ప్రజలు సురక్షితంగా ఉంటున్నారంటే సైనికులు కారణమన్నారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే ప్రభుత్వంతోపాటు పోలీస్ డిపార్ట్మెంట్ వారిది ప్రధాన పాత్ర అని తెలిపారు, దోషులు తప్పు చేసి ఉంటే రాజ్యాంగం,చట్ట ప్రకారం ప్రొసీడ్ కావాలన్నారు కేసు పెట్టి కోర్టులకు అప్పజెప్పాలని, కోర్టులే వారికి తగిన శిక్ష విధిస్తాయన్నారు, అలా చేయకుండా తమ సొంత ఆలోచన చొప్పున వారిపై ఇలా బహిరంగంగా దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు, సంబంధిత యువకులే పోలీసు వారిపై దాడికి పాల్పడ్డట్టుగా వారి వాదనలో నిజం ఉంటే సంబంధిత సీసీ ఫుటేజ్ ను వీడియోలను రిలీజ్ చేయాల్సిందిగా కోరారు,,,ప్రభుత్వం, ఉన్నతాధికారులు వెంటనే స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని, తద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ పై ప్రజల్లో నమ్మకం పెంచాలని,బాధితులకు తగిన న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులను కోరారు …