జనం న్యూస్. మే 28. సంగారెడ్డి జిల్లా. హత్నూర. నియోజకవర్గం ఇంచార్జ్ (అబ్దుల్ రహమాన్)
నిరుద్యోగులైన యువతక కోసం స్వయం ఉపాధి కల్పించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాజీవ్ యువ వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టిందని హత్నూర మండల ప్రత్యేక అధికారి సంగారెడ్డి జిల్లా జడ్పీ డిప్యూటీ సీఈవో స్వప్న అన్నారు,బుధవారంనాడు హత్నూర మండల కేంద్రంలో ప్రభుత్వ అధికారులు మరియు బ్యాంక్ అధికారులతో ప్రత్యేక మండల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీవ్ యువ వికాస్ పథకానికి దరఖాస్తు చేసుకున్న అరులైన లబ్ధిదారులకు త్వరగాఎంపిక చేసి దరఖాస్తులను వివిధ బ్యాంక్ అధికారుల వద్దకు పంపించాలని అన్నారు. బ్యాంక్ అధికారులు అరులైన లబ్ధిదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో. ఎంపీడీవో శంకర్. వివిధ విభాగాల అధికారులు. బ్యాంక్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.