ప్రముఖ వ్యాపార వేత్త ఇనకొండ చంద్రా రెడ్డి,
జనం న్యూస్, మే 30 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ విజయ్ కుమార్)
మర్కుక్ మండల పరిధిలోని పాములపర్తి గ్రామంలో ముదిరాజుల సంఘం ఆద్వర్యంలో కనకదుర్గమ్మ ఆలయాన్ని నూతనంగా నిర్మించారు.ఆలయ అభివృద్ధికి ప్రముఖ వ్యాపార వేత్త ఇనకొండ చంద్రా రెడ్డి, కూతురు ప్రణీత రెడ్డిలు గురువారం ఆలయ నిర్వహకులకు రూ.లక్ష విరాళం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు మ్యాకల కనకయ్య ముదిరాజ్,మహేష్,సుధాకర్ , రాజు,లక్ష్మణ్ ,తదితరులున్నారు.