జనం న్యూస్, మే 31 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)
మార్కూక్ మండల వనరుల కేంద్రం నుండి ప్రాథమిక,ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల కు సంబంధించిన పాఠ్యపుస్తకాలు అన్ని సబ్జెక్టులు ప్రధానోపాధ్యాయులకు మండలవిధ్యాదికరి, ఏ వెంకటరాములు,అందజేయడం జరిగింది. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల రిసోర్స్ పర్సన్ లు నాయక్, అంజలి,అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాలు పాల్గొన్నారు.ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలల కు నోటు పుస్తకాలు పంపిణీ పూర్తిగా ఇవ్వడం జరిగింది. జూన్ మొదటి వారము లో ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వర్క్ బుక్స్ మరియు ఒక జత యూనిఫాం లు ఇవ్వడం జరుగుతుంది.