జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట మే 31 రిపోర్టర్ సలికినీడి నాగరాజు
గుంటూరు ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ జూన్ 1అదివారం ఉదయము 10గంటలకు గుంటూరు లో ఏటుకూరి రోడ్ లో వివాహ కన్వెన్షన్ లో జరుగుతుంది కావున చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని చిలకలూరిపేట పట్టణంలోనూ,చిలకలూరిపేట మండలము లో నాదెండ్ల యడ్లపాడు మండలం లో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్దిని విద్యార్థులు అందరూ తప్పక హాజరై కెరీర్ గైడెన్స్ అవగాహన పెంపొందించుకోవాలి అనీ కృష్ణా యాదవ అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గోరంట్ల నారాయణ యాదవ్. Skyopaఅధ్యక్షులుగోలి భానుప్రకాష్ యాదవ్ తెలిపారు..గత 23 సంవత్సరాలుగా ప్రతీ సంవత్సరం పదవ తరగతి పాసైన విద్యార్థులు ఇంటర్ లో ఏ గ్రూప్ తీసుకుంటే ఎటువంటి కెరీర్ అవకాశాలు వుంటాయి.తద్వారా కెరీర్ ను ఎంచుకోవడం లోఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే విషయం గురించి సైకాలజీ నిపుణులు మరియు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ యూనివర్సిటీ పరిశోధకులు ద్వారా పూర్తి అవగాహన కల్పిస్తారనీ విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. స్థానిక సి అర్ క్లబ్ నందు జరిగిన పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం లో వివరాలు తేయజేసారు. SKYOPA కార్యదర్శి నర్రా నాగరాజుయాదవ్.ఆరాద్యుల రామకృష్ణ యాదవ్. పోటు శ్రీనివాసరావు యాదవ్.కొమ్మన బోయిన రాంబాబు యాదవ్. బొంత నాగేశ్వరరావు యాదవ్ నర్రా హరి కిరణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పాల్గొనే విద్యార్దులు పదవ తరగతి మార్క్స్ మెమో జిరాక్స్ కాపీ ఆధార్ జిరాక్స్ కాపీ తీసుకెళ్లాలని కోరారు. విద్యార్థులకు ఉచితంగా ఒక బ్యాగ్.కెరీర్ గైడెన్స్ కోర్సుల మెటీరియల్ డిక్షనరీ ఉచితంగా ఇవ్వబడుతుంది వివరాలకు 9014650393.9866013967.9885425034.9398748233 లలో సంప్రదించాలి అని ఆదివారము ఉదయము 8గంటల కల్లా స్థానిక సి అర్ క్లబ్ వద్దకు రావాలని. నేరుగా వెళ్ళే వాళ్ళు పై అడ్రస్ కి 10గంటల కల్లా చేరుకోవాలని తెలిపారు.