జనం న్యూస్ మే 31 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆశజ్యోతిని వెలిగించిన మానవత్వం
సిర్పూర్, టీ మండల కేంద్రం లోని అనాధ పిల్లలను ఉర్దూ దిన పత్రిక లో వచ్చిన వార్త ను చూసి స్పందించి న మానవత్వం మూర్తీభవించిన గొప్ప వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్. నిస్సహాయుల పట్ల, అనాథ పిల్లల పట్ల ఆయనకు ఉన్న కరుణ, ప్రేమ వెలకట్టలేనిది. ఇటీవల సిర్పూర్ టీ మండలం లోని నివసిస్తున్న పిల్లల దీనస్థితిని తెలుసుకున్న ఆయన, వారికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ అనాథ పిల్లలకు ఫారుక్ హుస్సేన్ తన వంతు సహాయాన్ని అందించారు. వారి ప్రాథమిక అవసరాలైన ఆహారం, కోసం కింటల్ బియ్యం నిత్యవసర సరుకులు ముగ్గురు పిల్లలకు ఒక్కొక్కరికి నాలుగు నాలుగు జతల వస్త్రాలు,సమకూర్చడానికి ఆయన ముందుకు వచ్చారు. అంతేకాకుండా, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించేందుకు దీర్ఘకాలిక ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ ఇల్లు కోసం మంత్రి సీతక్కతో మాట్లాడి జాబితాలో పేరు కూడా రూపొందించారు.
మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ చేసిన ఈ ఉదారమైన సహాయం అనాథ పిల్లల మొహాల్లో చిరునవ్వులు పూయించింది. ఆయన కేవలం ఆర్థిక సహాయం అందించడమే కాకుండా, వారి పట్ల ఆప్యాయతను చూపి, వారికి ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. ఈ చర్య సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయం. పేదరికం, నిస్సహాయతతో ఉన్నవారికి సహాయం చేయడానికి మనం అందరం ముందుకు రావాలని ఆయన సందేశం ఇచ్చారు. ఫారుక్ హుస్సేన్ వంటి గొప్ప వ్యక్తులు సమాజంలో ఉండటం అదృష్టమని, ఆయన మానవత్వం మరెందరికో స్ఫూర్తినిస్తుందని సిర్పూర్ ప్రజలు కొనియాడారు. ఈ సహాయం అనాథ పిల్లలకు కేవలం తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే కాకుండా, వారి భవిష్యత్తుకు ఒక ఆశా కిరణాన్ని కూడా అందిస్తుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ వార్తను వ్రాసిన విలేకరి అబ్దుల్ జమీల్ అభినందనలు తెలిపారు ఫారుక్ హుస్సేన్ చూపిన ఈ మార్గం మరిన్ని సేవా కార్యక్రమాలకు ప్రేరణనిస్తుందని ఆశిద్దాం.అయన వెంట సికెందర్ రాజశేఖర్ షైక్ అహ్మద్ అయాజ్ ప్రసాద్ మునోవార్ అలీ, మాజీ వార్డు సభ్యులు ఇఫ్ఫాత్ హుసేన్ సియాసత్ స్టాఫ్ రిపోర్టార్ అబ్దుల్ జమీల్, తదితరులు పాలుగోన్నారు.