జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.
నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి చౌక దుకాణాలు ప్రారంభించిన మేడా విజయసేఖర్ రెడ్డి ఈ సందర్భంగా మేడా విజయశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఇందులో భాగంగా రేషన్ సరఫరాను మరింత సులభతరం చేసేందుకు షాప్ల వద్దనే రేషన్ పంపిణీ చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 8 గంటల వరకు రేషన్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. రేషన్ షాపు డీలర్లు ప్రభుత్వా నియమ నిబంధనల ప్రకారం కార్డుదారులకు రేషన్ పంపిణీ చేయాలన్నారు. రేషన్ పంపిణీకి సంబంధించి తూకంలో తేడాలు లేకుండా ఖచ్చితమైన తూకంతో బియ్యం ఇవ్వాలన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు నందలూరు మండల తహసీల్దార్ పుల్లారెడ్డి, నాయకులు నాగిరెడ్డిపల్లి సర్పంచ్ జంబు సూర్యనారాయణ,నాగిరెడ్డిపల్లి తెదేపా నాయకులు ధనుంజయ నాయుడు, టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య, ఎంపీటీసీ శివయ్య,కారుకుర్తి వెంకటయ్య, తెదేపా నాయకులు మట్టి బాబు, పాటూరి చౌక దుకాణం డీలర్ సుభాషిని, అరవపల్లి డీలర్ కరీముల్లా, మహబూబ్ జాన్, వార్డ్ మెంబర్ నాగేంద్ర, స్టూడియో సురేష్, సూరిబాబు, దుర్గా ప్రసాద్ రెడ్డి, మని, అనిల్, నారాయణ, కూటమి నాయకులు, టిడిపి ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు మరియు మహిళా మణులు,మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.