జనం న్యూస్. తర్లుపాడు మండలం. జూన్ 2
ఆట పాటల్లోనే కాదు కాష్టాల్లోను అండగా నిలిచిన 2000-2001 పూర్వ విద్యార్థులు -మరణించిన తన నలుగురి మిత్రులకు 2లక్షల ఆర్ధిక చేయూత తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు గ్రామం లో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2000-2001 సంవత్సరం 10 వ తరగతి విద్యార్థులు ఆదివారం నాడు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు తమ కు విద్యా బోధనలు జీవిత పాఠాలు నేర్పిన తమ గురువులు జె కృష్ణమూర్తి, కె గోపాల కృష్ణ మూర్తి, కె సుబ్రహ్మణ్యం,డి వెంకటేశ్వర రెడ్డి, గోవిందయ్య, కె అన్విలాషిణి, ఎస్.కె యూసఫ్, పి కోటిమోహన్,ఏ సుబ్రహ్మణ్యం, వాడేల వెంకట రమణ లను పూల మాలతో సాలువతో సత్కరించారు పదో తరగతి చదివిన విద్యార్థులు చాలా కాలం తర్వాత మళ్లీ కలుసుకుంటారు. ఈ సమ్మేళనాల్లో, స్నేహితులు తమ గత జ్ఞాపకాలను పంచుకున్నారు ఒకరితో ఒకరు నవ్వుతూ, సరదాగా గడిపారు అనంతరం తన బాల్య మిత్రులు అయిన మాలపాటి వెంకటేశ్వర రెడ్డి, తిరుమల రెడ్డి శ్రీనివాస రెడ్డి, తాడి భూపాల్ రెడ్డి, రవి కుమార్ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 50 వేలు చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయల మేర ఆర్ధిక సహాయం అందించారు కష్టకాలం లో తన మిత్రులకు అండగా నిలిచినందుకు ఉపాధ్యాయులు పూర్వ విద్యార్థులను అభినందించారు ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు యం సుధాకర్ బాబు, స్కూల్ చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి,ఉపాధ్యాయులు గోసు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు