జనం న్యూస్ 2 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలోని సోమవారం రోజున తాసిల్దార్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఎమ్మార్వో సదానందం మాట్లాడుతూ సబ్బండ వర్గాల ప్రజలు ఏకమై గర్జించి తమ ఆత్మ గౌరవం కోసం సాగిన పోరాట ఫలితమే తెలంగాణ. సుదీర్ఘ స్వప్నం సహకారమైన సుదినం కోసం దశాబ్దాల కాలము కొట్లాడి నాలుగు కోట్ల ప్రజల కు విముక్తి లభించిందని రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి మువ్వన్నెల జెండాను ఎగురవేసి విద్యార్థులకు నోటు పుస్తకాలు పంపిణీ చేసి అమరుల త్యాగాల గురించి గొప్పగా వివరించారు.ఈ కార్యక్రమంలో ఆర్ ఐ స్రవంతి, ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు కాసిపేట రవి, ఇంకా రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.