జనం న్యూస్,జున్ 02,కంగ్టి
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలో గోవుల అక్రమ రవాణా వేల సంఖ్యలో జరుగుతున్న అక్రమ రవాణాను నిలిపివేయాలని శ్రీరామ్ సేన ఆధ్వర్యంలో సోమవారం స్థానిక డిఎస్పి కార్యాలయంలో బీఎస్పీని వినతి పత్రాన్ని అందించడం జరిగింది. గోవులను అక్రమంగా తరలించిన వారిపై కఠిన తరమైన శిక్షలను విధించాలని రాబోయే బక్రీద్ పండగ సందర్భంగా వేల సంఖ్యలో గోవుల అక్రమ రవాణా జరుగుతుందని అన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గం నుంచి పరుగు రాష్ట్రమైన కర్ణాటక బీదర్, జహీరాబాద్ కబేళాలకు తరలించడం జరుగుతుందని అన్నారు.గోసంపద నశించినట్లయితే మానవజాతి మనుగడ కొనసాగడం కఠిన తరం అవుతుందని అందుకే ఈ అక్రమ రవాణాను పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి గో అక్రమ రవాణాను నిలిపివేయాలని డీఎస్పీని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ శ్రీ రామ్ సేన నాయకులు రజనీకాంత్,సాయిరాం, ప్రశాంత్,రవికుమార్, సుధాకర్,సతీష్ కుమార్,ప్రవీణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.