ఈరోజు తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు
తెలంగాణ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం
రాష్ట్ర అధ్యక్షులు గవ్వల శ్రీకాంత్
జనం న్యూస్ 02 జూన్( కొత్తగూడెం నియోజకవర్గ ప్రతినిధి శంకర్ )
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్తగూడెం జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివ శంకర్ తో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అనంతరం గవ్వల శ్రీకాంత్ కోట శివశంకర్ తో కలిసి మాట్లాడుతూ మీరు రాసిన రాజ్యాంగం ఆర్టికల్ 3 ప్రకారం ఈరోజు తెలంగాణ ఏర్పడింది ఏర్పడిన సందర్భంగా ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నామంటే అది మీ పుణ్యం గా భావించి మీకు పూలమాలవేసి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా వందలాది మంది బలిదాననలను గుర్తించి తెలంగాణ మనో భావాలను గుర్తించి అప్పుడు కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ రాహుల్ గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు సెంటిమెంట్ తో ఒక పక్క ఒక కుటుంబం మరోపక్క సెంటిమెంట్ ను ఉపయోగించుకొని అనేక పార్టీలు తన స్వాలబం కొరకు అధికార దాహంతో కులాలని మతాలను రెచ్చగొడుతూ రాజకీయ లబ్ధి కొరకు అధికారం కొరకు కుర్చీల కొరకు పాకులాడుతున్నారు కాబట్టి తెలంగాణ లో ఉన్న నిరుద్యోగ యువకులు విద్యార్థులు మేధావులు ప్రజలు ఆలోచించుకొని దేశ భవిత కొరకు తెలంగాణ అభివృద్ధి కొరకు నిజాయితీగా న్యాయంగా పనిచేసే నాయకులకు అండగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ను మూడు ముక్కలు చేసి మూడు పువ్వులు ఆరు కాయలుగా చేసి ఎవరి ఇష్టం వారిదిగా వారు వాడుకుంటున్నారు నీళ్ళు నిధులు నియామకాలు పేరుతో ఏర్పడిన తెలంగాణ లో నీళ్ల పేరుతో కట్టిన ప్రాజెక్టులు తెల్లారే కూలిపోతున్నాయి మిగులు బడ్జెట్ ను అప్పుల పాలు చేసి నిధులు లేక తెలంగాణ నడి రోడ్డు మీద నిలుచున్నది నియామకాలు లేక నిరుద్యోగ యువతీ యువకులు రోడ్లమీద తిరుగుతున్నారు ఔట్సోర్సింగ్ సొసైటీలని ఏర్పాటు చేసి వారి ఏజెంట్లను తయారు చేసి అదే నిరుద్యోగుల నుండి లక్ష రూపాయలు వసూలు చేస్తున్నారు ఇంకా ఇక్కడ తెలంగాణ ఎక్కడుంది ప్రజా తెలంగాణ అని అన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి గతంలో అధికారంలో టిఆర్ఎస్, బి ఆర్ ఎస్ ఇప్పుడున్న ప్రభుత్వం మోచేతికి బెల్లం పెట్టీ నాకు మంటున్నారని ఆకాశంలో ఉన్న సూర్యుడు చంద్రుడు చుక్కలను చూపిస్తూ తెలంగాణ దొరల రెడ్డి ల గాడిలలో బంధి అయిందని విద్యార్థులను యువకులను మహిళలను రైతులను మోసం చేస్తూ అర చేతి లో వైకుంఠం చూపిస్తున్నారని ఆ బ్రమలలో మోస పోయి అందరు భ్రమలు పడుతున్నారని అన్నారు
కులం మతం మీద ఒకరు పని చేస్తే మరొకరు దానినే తింపి మతం కులాల మీద రాజకీయం చేస్తున్నారని అన్నారు కేంద్రంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారం ఇస్తే అభివృద్ధి చేస్తామని సంకలు గుద్దు కుంటుంది ఇప్పుడు తెలంగాణ భారత దేశంలో ఉందా లేకుంటే ఇతర దేశాలలో ఉందా అని అన్నారు కేంద్రం నుంచి వచ్చే నిధులు అదనపు నిధులు తెచ్చి ఎందుకు అబివృద్ధి చేసి చూపించడం లేదని అన్నారు మాయల ఫకీర్ లాగ మాట్లాడటం తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏమి లేదని అన్నారు తెలంగాణ ఎస్ సి ఎస్ టి బిసి మైనారిటి విద్యార్థి యువజన సంఘం టివి వై ఎస్ 2009 తెలంగాణ ఏర్పాటు కొరకు ఏర్పాటు చేయడం జరిగిందని తెలంగాణ పోరాడి సాధించినక తెలంగాణ తెలంగాణ అభివృద్ధి కొరకు నీళ్లు కొరకు నిరంతరం పోరాటం చేయడం జరుగుతుందని తెలిపారు చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు తెలంగాణ ఏర్పాటు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ జరుపుకుంటున్నాం కానీ అధికారంలో గాని ఈరోజు ఎవరికి పూలమాలలు వేయాలి ఎవరికి వేయకూడదు తెలియని పరిస్థితుల్లో ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్తి యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోట శివశంకర్ సింగరేణి వి ఆర్ ఎస్ డిపెండెండెంట్స్ పోరం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకరి శ్రీనివాస్ భూపతి అశోక్ బిర రవీంద్రనాథ్ అల్లం శ్రీనివాస్ కోట విద్యాసాగర్ విజయ్ కోట రాజా ఆనంద్ చంద్ర ఏర్వా రుత్విక్ పాదం పృధ్వీ సాయి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు