జనంన్యూస్. 03. నిజామాబాదు. ప్రతినిధి.
ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్..
ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్నందున రైతులకు సరిపడ నాణ్యమైన విత్తనాలు సప్లై చేయాలని, నకిలీ విత్తనాల వ్యాపారుల మోసాలకు గురి కాకుండా చూడాలని ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి కారల్ మార్క్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిరికొండ మండల కేంద్రంలోని గడ్కోలు గ్రామంలో 3-6-25 న ఏఐకేఎంఎస్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
తెలంగాణలో విత్తనాలు సప్లై ప్రభుత్వ సంస్థల కన్నా ప్రైవేట్ విత్తన కంపెనీలు నేటికీ వారే 70% అందిస్తున్నారని కేవలం 30 శాతం మాత్రమే ప్రభుత్వ విత్తనా సంస్థల ద్వారా విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వారన్నారు.ప్రైవేట్ విత్తన సంస్థ వ్యాపారులు నకిలీ విత్తనాలతో రైతులను నిలువు దోపిడీకి గురి చేస్తున్నారని వారి దోపిడిని అరికట్టి రైతులను ఆదుకోవాలని వారన్నారు.తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థకు ప్రభుత్వం ఇవ్వాల్సిన 540 కోట్ల రూపాయలను వెంటనే విడుదల చేసి సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. తెలంగాణ విత్తన అభివృద్ధి సంస్థ ద్వారానే రైతులకు అన్ని రకాల సరిపడా విత్తనాలు అందించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు సరిపడా అన్ని రకాల ఎరువులు, విత్తనాలు, రుణాలు అందించాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ నాయకులు గులాం హుస్సేన్,మండల కార్యదర్శి ఎల్లయ్య,నాయకులు చిన్నగంగాధర్,రాజాగౌడ్,రాజు, జాకీర్, పివైఎల్ మండల అధ్యక్షులు మల్కీ సంజీవ్, తదితరులు పాల్గొన్నారు.