జనం న్యూస్ జూన్ 4 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలంలోని పత్తి పాక గ్రామంలో మొదటి రోజున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భూభారతి రెవెన్యూ సదస్సు ను తాహసిల్దార్ కాల్వల సత్యనారాయణ ఆధ్వర్యంలో ప్రారంభించారు ఈ సదస్సు ను పరకాల ఆర్డీవో నారాయణ సందర్శించి రైతుల దరఖాస్తులను పరిశీలించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికున్న సమస్యలను దరఖాస్తు రూపం ద్వారా తీసుకుని వారి సమస్యలను పరిష్కరించే విధంగా చూడాలని అధికారులకు తెలియజేశారు రెవెన్యూ సదస్సులో రైతుల నుండి మొత్తం 153 దరఖాస్తులు భూ సమస్యలపై వాటిని తీసుకుని వారికి రిజిస్ట్రేషన్ చేశారు రైతుల వద్ద రెవెన్యూ యంత్రాంగం ప్రభుత్వం పంపి భూ సమస్యలు పరిష్కరించేలా చేస్తుంది అన్నారు రైతులు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రతి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహశీల్దార్ ప్రభావతి ఆర్ఐలు రమేష్ ఎం రమేష్ కార్యలయ సిబ్బంది రైతులు పాల్గొన్నారు….