ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు
జనం న్యూస్ జూన్ 4 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
"ముమ్మిడివరం అశేషప్రజానకానికి కూటమి కార్యకర్తలు,నేతలకు,మీడియా మిత్రులకు నా నమస్కారాలుసరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణ అధ్యాయం అనిపించే రీతిలో రాష్ట్ర ప్రజలు చారిత్రాత్మక తీర్పుతో కూటమి ప్రభుత్వానికి అధికారం అప్పగించారు. వారి ఆలోచనలకు ఆకాంక్షలకు అనుగుణంగా ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మన ముమ్మిడివరం నియోజకవర్గం లో ఈ సంవత్సర కాలంలో పెరిగిన పెన్షన్లు అదేవిధంగా అన్న క్యాంటీన్ పునః ప్రారంభం ఓఎన్జిసి పరిహారం కింద గంగపుత్రులకు ఆర్థిక సహాయం,అదేవిధంగా మత్స్యకార సేవలో భాగంగా వేట నిషేధకాలంలో ఆర్థిక సహాయం,పల్లె పండుగ సీసీ రోడ్లు డ్రైన్లు నిర్మాణం, రోడ్లు గుంతలు పూడ్చడం వంటి అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రధాన నరేంద్ర మోడీ ,రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఐక్యంగా రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని ముమ్మిడివరం ప్రజలకు తెలియజేసుకుంటున్నాం. నా ఈ ప్రయాణంలో మీ ప్రేమ, అభిమానాలు, ఆప్యాయత ఎప్పుడూ నా యందు ఉండాలని ఇంకా మీ సహకారంతో మన నియోజకవర్గాన్ని ఇంకా అభివృద్ధి చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను"కృతజ్ఞతలతో……ఇట్లు:మీ దాట్ల సుబ్బరాజు( బుచ్చిబాబు ).