జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ మండలం లోని చిల్లటిగూడ గ్రామపంచాయతీ లో ఇందిరమ్మ ఇల్లు భూమిపూజ కార్యక్రమలో కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాంగ్రేస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు ఇంటి నిర్మాణనికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ చిత్తశుద్ధితో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజా ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు పేద వాడి కలలను నిజం చేయడానికి ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని అన్నారు ఇందిరమ్మ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గత పాలకులు చేసిన అప్పులు తీర్చడంతో పాటు సంక్షేమ ఫలాలను అమలు చేస్తున్నాన్నారు. ప్రతి నిరుపేద ఆడబిడ్డకు ఇందిరమ్మ ఇండ్లను నిర్మించి ఇవ్వాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నిరుపేద కుటుంబానికి 5 లక్షల రూపాయలతో ఇండ్లను నిర్మించుకోవడానికి అవకాశం కల్పించిందని, అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బొమ్మేనా బాలేష్ గౌడ్, మేకర్తి శ్రీనివాస్, వినోద్, బబ్లు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..