కూటమి సర్కార్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని నినాదాలు
జనం న్యూస్,జూన్04,అచ్యుతాపురం:
ఎన్నికల్లో విజయం సాధించి.. అధికారంలోకి కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని,కూటమి ప్రభుత్వం చేసిన ఈ మోసంపై ప్రజల తరఫున వైఎస్సార్సీపీ ఉద్యమబాట పట్టింది. ఆపార్టీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఏపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజైన
జూన్ 4ను 'వెన్నుపోటు దినం' గా పాటించాలని నిర్ణయించి నిరసనలకు దిగింది.అందులో భాగంగా
ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ యువి రమణమూర్తి రాజు (కన్నబాబు) ఆధ్వర్యంలో ఎలమంచిలిలో వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించి వైసీపీ నాయకులు,
కార్యకర్తలు,ప్రజలలతో కలసి ర్యాలీగా వెళ్లి ఎలమంచిలి ఎమ్మార్వోకి వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ సూపర్ సిక్స్ సహా 143 హామీలతో ప్రజలను నమ్మించి కూటమి ప్రభుత్వం మోసం చేసిందని,వైసీపీ నాయకులు,కార్యకర్తలు పై అక్రమ కేసులు పెడుతూ అంబేద్కర్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ శ్రేణులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.