జనం న్యూస్ జూన్ 04 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని పలు బేకరి లలో నాణ్యత ప్రమాణాలు పాటించకుండా కుళ్ళిన, బూజు పట్టిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్నారు. కాగజ్నగర్ పట్టణంలోని విజేత హాస్పిటల్ ప్రక్కన గల బాకేరీలో నిన్న ఒక్క వినియోగదారుడు కొన్న కేక్ బూజు పట్టి, దుర్వాసన రావడం తో బేకరి యజమాన్యని ప్రశ్నించడంతో ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అనే సమాధానం రావడం జరిగింది. ముఖ్యంగా బేకరీలలో చికేన్పఫ్, ఎగ్పఫ్, కర్రీపఫ్లో నాణ్యత లోపిస్తుందని ప్రజల నుండి విమర్శలు వెలువెత్తుతున్నాయి. చిన్నపిల్లలు తినే ఆహార పదార్థాల తయారీలో నాణ్యత ప్రమాణాలపై అయా యాజమాన్యలను ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని పలువురు వినియోగదారులు వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న ఇలాంటి బేకరీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు..