ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు
రంగంలోకి దిగిన యడ్లపాడు పోలీసులు
ఠానాలో ఫిర్యాదు చేసిన గ్రామస్తులు
యడ్లపాడుమండలంలింగారావుపాలెంలో గ్రామదేవత గుడిలో సీసీ కెమెరాల ధ్వంసంపై కేసు నమోదైంది.పోలీసులు తెలిపిన వివరాల మేరకు..గ్రామంలోని గంగమ్మ తల్లి గుడిలో ఇటీవల కొలుపులు నిర్వహించారు.అయితే వీటకి సంబంధించి కొందరు ఈనెల 2వ తేదీన గుడిలో దీపారాధన చేశారు.ఈ విషయంపై సదరు గుడికి చెందిన మరికొందరితో దీపారాధన చేసిన వారితో వాగ్వాదం జరిగింది.ఇదే తరహాలో గతంలోనూ ఒకమారు వాగ్వాదం నెలకొన్న నేపథ్యంలో పోలీసులు ఇరువర్గాల వారిని పిలిపించి సఖ్యత చేసి పంపించినా ఫలితం లేకపోవడం, ఆ తర్వాత గుడిలో సీసీకెమెరాలను ధ్వంసం చేయడం జరిగింది.దీంతో కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ టి శివరామకృష్ణ తెలిపారు.