*జనం న్యూస్ 5 జూన్ భీమారం మండల ప్రతినిధి కాసిపేట రవి
దేశ ప్రజలకి భారత రాజ్యాంగం అందించిన హక్కులు, స్వేచ్ఛ,సమానత్వం, సౌబ్రాతత్వం, అందరికీ అందని ద్రాక్షగా పాలకులు చేస్తున్నారని . పేదలు దళితులు బహుజనులు నేటికీ రాజ్యాంగ హక్కులు అందడం లేదని ఉపాధ్యక్షులు కాసిపేట రవి ఆవేదన వెల్లుబుచ్చాను . స్వేచ్ఛగా భావాలను వెలిబుచ్చితే నక్సలైట్ అంటున్నారు దేశద్రోహి అంటున్నారని ప్రభుత్వం దేశ ప్రజలలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోయి తీవ్ర అలజడులు నెలకొంటున్నాయి. పేద ధనిక తేడాను నిర్మూలించి సోషలిజం వైపు తీసుకెళ్లి ఆర్థిక సాంఘిక రాజకీయ సమానత్వం సాధించాలని, భారత రాజ్యాంగ లక్ష్యం పాలకులు నెరవేర్చలేదన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే అన్నట్లు నేటి పాలకులు దిగజార్చారు అని ధ్వజమెత్తారు ఎన్నికలలో డబ్బు, మద్యం, కులం, మతం, ప్రభావితం చేస్తున్నాయని పేదలు ఎన్నికలలో నిలిచి గెలిచే పరిస్థితి లేదని
ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు జీవించే హక్కుకు భంగం కలిగిస్తూ రాజ్య హింస కొనసాగిస్తున్నారు పేదరిక నిర్మూలనకు భూమిలేని నిరుపేద దళిత బహుజన లందరికీ ప్రతి కుటుంబానికి భూమి పంచాలని బుటకపు వాగ్దానాలతోటి ఎన్నికల్లో గెలుస్తున్నారు గెలిచిన తర్వాత ఇచ్చిన వాగ్దానాల్ని తుంగలో తొక్కుతున్నారని, వికసిత భారత్ హామీలు గాని ప్రజా పాలన హామీలు వెంటనే నెరవేర్చి చిత్తశుద్ధి ప్రదర్శించాలన్నారు. పేదల కష్టాలు పోవాలంటే రైతు కూలీ రాజ్యం రావాలంలి ఆటో కార్మికులకు సంవత్సరానికి 15 వేల రూపాయలు విద్యార్థులకు స్కూటీలు, మహిళ పెండ్లికి తులం బంగారం, సన్న వడ్లకు 500 బోనస్, వృద్ధాప్య వితంతు వికలాంగులకు ఇచ్చే పెన్షన్లు పెంచుతామన్నమాట గ్యారెంటీ ల పేరుతో ఇచ్చిన నీటి మూటలుగా తేలిపోతున్నాయన్నారు. వెంటనే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని ఇందిరమ్మ ఇండ్లు మహిళను లక్షాధికారులను కోటీశ్వరులను చేస్తామన్న హామీలు అమలు చేయాలని లేని ఎడల గత పాలకులకు పట్టిన గతే పడుతుందన్నారు.