విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్,ఐపిఎస్
జనం న్యూస్ 23 జనవరి విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక్:-
స్టెఫెండరీ పోలీసు కానిస్టేబులు ఉద్యోగ నియామకాలకు మహిళ, పురుష అభ్యర్థులకు నిర్వహించిన పి.ఎం.టి. మరియు పి.ఈ.టి.పరీక్షల ప్రక్రియ ముగిసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జనవరి 22న తెలిపారు.
డిసెంబరు 30 నుండి జనవరి 22 వరకు 16రోజులపాటు పోలీసు పరేడ్ గ్రౌండులో పోలీసు కానిస్టేబుళ్ళ
ఉద్యోగ నియామకాల కొరకు పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలను నిర్వహించామన్నారు. జనవరి 22 (చివరి రోజు)న 477 పురుష, 158 మహిళా అభ్యర్థులు పి.ఎం.టి./పి.ఈ.టి. పరీక్షలకు హాజరయ్యారన్నారు. ఎత్తు, బరువు, ఛాతీ విస్తీర్ణం కొలతల్లో అనుమానం ఉండి, అప్పీలు చేసుకున్న అభ్యర్ధులకు తూనికలు, కొలతల అధికారుల సమక్షంలో మరోసారి పరీక్షలు నిర్వహించామని జిల్లా ఎస్పీ తెలిపారు. పి.ఎం.టి.పి.ఈ.టి. పరీక్షలకు 5,687 మంది పురుష అభ్యర్ధులు, 1141 మంది మహిళా అభ్యర్ధులు హాజరుకాగా, వారిలో తుది రాత పరీక్షకు 4,019 పురుష అభ్యర్థులు, 530 మహిళా అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నియామకాల ప్రక్రియను ప్రతీ రోజూ వేకువ జామున 5గంటల నుండే ప్రారంభం కావడం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడంతో, పి.ఎం.టి.పి.ఈ.టి. పరీక్షలు సకాలంలో పూర్తయ్యాయన్నారు. పోలీసు నియామకాల ప్రక్రియను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ
జి.నాగేశ్వరరావు స్వయంగా పర్యవేక్షించారు. అభ్యర్ధులకు ముందుగా హాల్ టిక్కెట్స్ ను పరిశీలించి, పోలీసు పరేడ్ గ్రౌండులోకి అనుమతించారు. అనంతరం, అభ్యర్ధుల విద్యార్హతలు, రిజర్వేషన్లు, వయస్సు నిర్ధారించే ధృవ పత్రాలను పరిశీలించి, అన్ని సర్టిఫికేట్స్ సక్రమంగా ఉన్న అభ్యర్ధులకు మాత్రమే బయోమెట్రిక్ తీసుకొని, పి.ఎం.టి. పరీక్షలకు అనుమతించామన్నారు. ఆధునిక సాంకేతిక నైపుణ్యం కలిగిన డిజిటల్ ఇక్విప్ మెంట్స్ వినియోగించి, అభ్యర్థుల ఎత్తు, ఛాతీ కొలతలను నిర్ధారించి, అర్హత సాధించిన అభ్యర్థులకు పి.ఈ.టి. పరీక్షలను అనుమతించామని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ నియామక ప్రక్రియలో పాల్గొని, సమర్ధవంతంగా
విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, తమ మినిస్టీరియల్ అధికారులు, పోలీసు సిబ్బంది, టెక్నికల్ సిబ్బంది, వైద్య, పి.ఈ.టి.లను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ నియామక ప్రక్రియలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎఆర్ అదనపు ఎస్పీ జి.నాగేశ్వరరావు, డిఎస్పీలు
ఎం.వీరకుమార్, యూనివర్స్, పి.వి.రమణమూర్తి, ఎస్.బాపూజీ, టి.ఎన్. శ్రీనివాసరావు, కే.థామస్ రెడ్డి, ఎఓ పి.శ్రీనివాసరావు, పలువురు సిఐలు, రిజర్వు ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పిఈటీలు మరియు ఇతర పోలీసు అధికారులు, పోలీసు కార్యాలయ ఉద్యోగులు పాల్గొని, ఎంపిక ప్రక్రియ సజావుగా జరిగే విధంగా విధులు నిర్వహించారు