విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
జిల్లాలో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటుకు ప్రత్యేకంగా రూపొందించిన2 టెథర్డ్ డ్రోన్ (Tethered Drone) ను రాష్ట్ర పోలీసుశాఖకు జిల్లాకు మంజూరు చేసినట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. సాధారణ డ్రోన్స్ కు భిన్నంగా, ప్రత్యేక అవసరాలకు కోసం రూపొందించిన టెథర్డ్ డ్రోన్ పని తీరును జిల్లా ఎస్పీ జూన్ 5న జిల్లా పోలీసు కార్యాలయంలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ - ఒక నిర్ధిష్ట ప్రదేశాల్లో నిర్వహించే సభలు, సమావేశాలు, జాతర్లలో మరింత నిఘాను ఏర్పాటు చేసేందుకు టెథర్డ్ డ్రోన్ ఎంతో ఉపయోగ పడుతుందన్నారు. ఈ డ్రోన్ సుమారు 10గంటలపాటు గాలిలో తేలుతూ ఒక నిర్ధిష్ట ప్రదేశంలో జరిగే కార్యకలాపాలపై నిఘాఏర్పాటు చేసే
సామర్ధ్యం కలిగి ఉందన్నారు. ఎలక్ట్రిక్ పవర్ లేదా జనరేటరు సహాయంతో ఒక కేబుల్ ఆధారంగా డ్రోన్ పని
చేస్తుందన్నారు. ఈ అత్యాధునకి డ్రోన్ సహాయంతో ఒక ప్రాంతంలో నిరంతర నిఘా ఏర్పాటు చేయడానికి, ఒక
ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగే విపత్తుల్లో సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్ టవర్ గాను, ఇంటర్నెట్ సేవలందించేందుకు ఫ్లోటింగ్ టవర్ గాను పయోగపడుతుందన్నారు. జి.పి.ఎస్. అవాంతరాలు ఉన్న ప్రదేశాల్లో కూడా ఈ డ్రోన్ పని చేసే సామర్ధ్యంతోపాటు ఈ డ్రోను అదనంగా పబ్లిక్ అడ్రస్ సిస్టం, డే/నైట్ విజన్ కెమెరా, ఎఐ కెమెరాలను కలిగి ఉన్నాయన్నారు. ధర్నాలు, నిరసనలు తెలిపే సమయంలో నిరసనకారులు లేదా పోలీసు సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చేందుకు పబ్లిక్ అడ్రస్ సిస్టం కూడా ఈ టెథర్డ్ డ్రోన్ కు అమర్చబడి ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా పోలీసుశాఖ అవసరాలను బట్టి ఈ టెథర్డ్ డ్రోన్ ను ప్రజలు ఎక్కువగా గుమిగూడే ముఖ్య వ్యక్తుల సభలు, సమావేశాలు, జాతర్లలో నిఘా ఏర్పాటు చేసేందుకు వినియోగించనున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్బీ సిఐలు ఆర్.వి.ఆర్.కే. చౌదరి, ఎ.వి.లీలారావు, డ్రోన్ పైలట్స్ నరేష్, వెంకటేష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.