జనం న్యూస్ 06 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గ్రామాలలో కోళ్ల ఫారం పెట్టాలి అంటే ప్రభుత్వం నుండి కొన్ని రూల్స్ నిబంధనలను తప్పనిసరిగా ఆచరిస్తూ సంబంధిత సర్టిఫికెట్లను అందుబాటులో ఉంచాలి. స్థల ఎక్విటేషన్ దగ్గర నుంచి సంబంధిత సర్టిఫికెట్లు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఐదు సంవత్సరాల క్రితం మండలంలోని బిరసాడ వలస గ్రామాన్ని ఆనుకొని ఒక కోళ్ల ఫారం నీ ఏర్పాటు చేశారు. గతంలో మండల నాయకులతో గ్రామనివాసులతో అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడంతో ఎటువంటి వాసన రాకుండా జాగ్రత్తలు పాటించారు. అయితే ఇప్పుడు వాసన ఎక్కువ కావడంతో స్థానిక ప్రజలు బిరసాడ వలసగ్రామస్తులు మండల జనసేన పార్టీ నాయకులు సహాయంతో జనసేన మండలపార్టీ అధ్యక్షులు సబ్బవరపు రాజశేఖర్ ఆధ్వర్యంలో కోళ్ల ఫారం దూరంగా తరలించాలని రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ కోళ్ల ఫారం కంపెనీ నుండి వచ్చే దుర్వాసన ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని దోమలు, ఈగలతో సతమతమవుతూ అనారోగ్యానికి గురవుతున్నారని కోళ్ల ఫారం మేనేజ్మెంట్ తక్షణమే స్పందించి కోళ్లఫారాన్ని ఊరికి దూరంగా తరలించాలని కోరుతున్నారు. లేనిపక్షంలో అనేక ధర్నాలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అధికారులకు కోళ్ల ఫారం మేనేజ్మెంట్ కు హుక్కుమ్ జారీ చేశారు. కార్యక్రమంలోమండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చలుమూరి వెంకట్రావు మండల బీ.జే.పి పార్టీ అధ్యక్షులు మణిపూరి అప్పలనాయుడు పల్లె సింహాద్రి గ్రామ పెద్దలు ,మండల నాయకులు, జనసేన కార్యకర్తలు, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.