జనం న్యూస్ 6జూన్. కొమురం భీమ్ జిల్లా. డిస్ట్రిక్ట్ స్టాఫ్ఫర్.
సిర్పూర్( యు ):మండల కేంద్రంలోని రక్షకభట నిలయంలో ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో హరితవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 450 మొక్కలను నాటినట్లుగా ఆయన తెలిపారు. అనంతరం మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం ను పురస్కరించుకొని ఉన్నతాధికారుల ఆదేశాలతో అడిషనల్ ఎస్పి చిత్తరంజన్ పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నట్లు తెలిపారు. పెరుగుతున్న కాలుష్యం నివారణ చేయాలంటే ప్రతి ఒక్కరు చెట్లు నాటాలని సూచించారు. చెట్లు మానవ మనుగడకు ఎంతో ముఖ్యమైనవని అన్నారు. ప్రగతికి మెట్లుగా నిలిచే చెట్లను ప్రతి ఒక్కరు నాటి పెంచాలన్నారు. అదేవిధంగా కాలుష్య నివారణ కొరకు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ మరియు వాహనాల ద్వారా వచ్చే కాలుష్యంతో ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారన్నారు. ఒక దశలో వీటితో క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయని పలు అధ్యయనాలు తెలిపాయని అన్నారు. ప్రజలు ప్లాస్టిక్తో మరియు ఎక్కువ పొగసిమే వాహనాలతో దూరంగా ఉండాలని సూచించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఉపాధి హామీ ద్వారా ఏర్పాటు చేసిన నర్సరీ మొక్కలను ప్రతి ఇంట్లో పెరటిలో పంట పొలాల గట్లపై రోడ్డుకు ఇరువైపులా విరివిగా పెంచాలని మండల ప్రజలకు విజ్ఞప్తి చేశారు.