జనం న్యూస్, జూన్ 6, ఝరాసంగం మండలం, సంగారెడ్డి జిల్లా.( జహీరాబాద్ నియోజకవర్గం ప్రతినిధి, చింతలగట్టు నర్సిములు )
భూ సమస్యలను పరిష్కరించడానికే, రెవెన్యూ సదస్సులను నిర్వహించడం జరుగుతుందని, ఝరాసంగం మండల తహసిల్దార్, తిరుమల రావు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని, గినియర్ పల్లి మరియు, గుంత మర్పల్లి గ్రామాలలో ని, రెవెన్యూ సదస్సులలో ఆయన పాల్గొని, రైతుల వద్ద నుండి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భూభారతి రెవెన్యూ చట్టం 2025 గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా, రైతులు తమ భూమికి సంబంధించిన సమస్యలను, తగిన ఆధారాలతో, దరఖాస్తు రూపంలో తమకు సమర్పించాలని, తదుపరి క్షేత్రస్థాయిలో విచారణ చేసి, సమస్యను పరిష్కరించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాలలో ఝరాసంగం మండల తహసిల్దార్ తిరుమల రావ్, ఉప తహసిల్దార్ కరుణాకర్ రావు, ఆర్. ఐ. రామారావు, ఏజాజ్, పవన్, బీరప్ప, రమేష్, మరియు ఆయా హోదాలకు సంబంధించిన రెవెన్యూ సిబ్బంది,ఆయా గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.