సన్న బియ్యం పంపిణీ హర్షణీయం
జిల్లా కాంగ్రెస్ నాయకులు నాగరాజ్ గౌడ్
జనం న్యూస్ జూన్ 6 ( బీబీపేట్ మండలం కామారెడ్డి జిల్లా )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉచిత సన్న బియ్యం పథకం ప్రారంభించి ప్రజాపాలన లో పేదలకు నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ చేయడం పట్ల జిల్లా కాంగ్రెస్ నాయకులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్, హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పథకం ద్వారా రేషన్ బియ్యం అక్రమాలకు అడ్డుకట్ట పడటమే కాకుండా, పేదలకు సన్నబియ్యం అందుతోందన్నారు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో హామీలు ఇచ్చిన విధంగా అధికారంలోకి రాగానే ఒక్కో పథకాన్ని అమలు చేస్తు రాష్ట్ర అభివృధ్ధి పేదల సంక్షేమం దిశగా అడుగులు వేస్తోందన్నారు. 2025 ఏప్రిల్ 1న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పేదలకు ఉచితంగా సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారని పేదవాడి ఆకలి తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సాహసోపేతమైనదని అన్నారు. ప్రజాపాలన లో కుటుంబంలో ఒక్కో వ్యక్తికి నెలకు 6 కిలోల చొప్పున సన్న బియ్యాన్ని అందిస్తూ పేద ప్రజల కడుపు నింపుతొందన్నారు. ఉచిత సన్నబియ్యం పంపిణీ పేద ప్రజలకు ఉపశమనం కలిగించే పథకంగా నిలుస్తోందని పేదల ఆత్మగౌరవానికి ఈ పథకం ప్రతీకగా నిలవడమే కాకుండా పేదలకు పెద్దపీట వేసిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. గత ప్రభుత్వం పదేళ్ళలో ఒక్క రేషన్ కార్డు మంజూరు చేయలేదని ప్రజా పాలనలో ధరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ నూతనంగా రేషన్ కార్డులు మంజూరు కావడం మూడు నెలల రేషన్ ఉచిత సన్న బియ్యం ఓకేసారి జూన్ నెలలో అందించడం పట్ల సామాన్య ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కి మంత్రి వర్గానికి,ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, లకు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు.