బిచ్కుంద జూన్ 6 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గుండె నెమలి గ్రామంలో శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా యంత్రాంగం ఆదేశాల మేరకు బిచ్కుంద మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయుల బృందంతో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో సకల సౌకర్యాలను ప్రైవేట్ పాఠశాల ధీటుగా కల్పిస్తున్నారని తెలిపారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల ను కలిసి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న సౌకర్యాల గురించి అవగాహన కల్పించారు ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థిని విద్యార్థులను తీర్చిదిద్ది ఉన్నత స్థాయిని చేరే విధముగా కృషి చేస్తున్నామని తెలిపారు. అంతకుముందు బడిబాట కరపత్రాలను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో