వనపర్తి జిల్లాలో భద్రాచల రామయ్య తలంబ్రాల పంపిణి
అన్ని జిల్లాలకు పంపిస్తున్నాం: రామకోటి రామరాజు
జనం న్యూస్, జూన్ 7 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లోని శ్రీరామకోటి భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు పిలుపు మేరకు శుక్రవారం నాడు వనపర్తి జిల్లాలో భద్రాచల రామయ్య ముత్యాల తలంబ్రాల పంపిణీ కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి జాతీయ అధ్యక్షులు పూరి సురేష్ శెట్టి, ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ రామకోటి రామరాజు, పిలుపు మేరకు మా వనపర్తి జిల్లా నలు మూలల నుండి వేలాది భక్తులం గోటి తలంబ్రాలు ఓలిచి భద్రాచల కల్యాణనికి అందించామన్నారు. మళ్ళీ వారందరికీ తిరిగి కళ్యాన తలంబ్రాలు అందించాలని గజ్వేల్ నుండి రామకోటి రామరాజు, మాకు తలంబ్రాలు అందించగా ఈరోజు పంపిణీ ప్రారంభించామని తెలిపారు. తలంబ్రాలు అందుకున్న భక్తులు మాట్లాడుతూ ఎన్ని జన్మల పుణ్యమో ఈ రామయ్య తలంబ్రాలు పొందడం అని ఆనందాన్ని వ్యక్త పరిచ్చారు.