జనం న్యూస్ జూన్ 06:
నిజామాబాద్ జిల్లాఏర్గట్ల మండలంలోని గుమ్మిర్యాల గ్రామానికి చెందిన బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు సోమ రాజేశ్వర్ (పంతులు )యొక్క తండ్రి గంగారెడ్డి ఇటీవల చనిపోయారు. శుక్రవారం రోజునా మాజీ మంత్రి ఏమ్మెల్యేప్రశాంత్ రెడ్డివారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనో ధైర్యాన్ని కలుగజేశారు. ఈ కార్యక్రమం లో ఏర్గట్ల మాజీ ఎంపీపీ ఉపేందర్ రెడ్డి, తాళ్ళరాంపూర్ సొసైటీ చైర్మన్ పెద్దకాపుల శ్రీనివాస్ రెడ్డి,తాళ్ళరాంపూర్ మాజీ ఉపసర్పంచ్ క్యాతం దేవేందర్, నేరెళ్ల రాజారెడ్డి, నాయకులు పాల్గొన్నారు.