జనం న్యూస్ జూన్ 06 ఆసిఫాబాద్ జిల్లా బ్యూరో
ఆసిఫాబాద్ కలెక్టరేట్ కార్యాలయం వద్ద శుక్రవారం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపించాలని, కలెక్టరెట్ కార్యాలయం ధర్నాకు దిగడం జరిగింది. ఆనంతరం ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ
ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో దోపిడీ, దగా, రౌడీ రాజకీయం ఎక్కువయ్యాయి, ప్రజా పాలనలో ప్రోటోకాల్ పాటించడం లేదని ఒక నియోజకవర్గ శాసనసభ్యులు కు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులకు ఎలాంటి ప్రోటోకాల్ లేని వ్యక్తులకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు, భూమి పూజ చేయించడం దుర్మార్గం ఈ కాంగ్రెస్ రాక్షస పాలనలో తెలంగాణ చీకటి అంధకారమైపోయింది.
కాంగ్రెస్ నాయకులు, ప్రభుత్వ అధికారుల అండదండలతో అరాచకాలు చేస్తూ తెలంగాణ పరువు తీస్తూ చెలామణి అవుతున్నారు ప్రజలు అన్ని గమనిస్తున్నారని కాంగ్రెస్ కు తొందరలోనే స్థానిక ఎన్నికల్లో చరమగీతం పాడి గుణపాఠం చెప్తారని మండిపడ్డారు ప్రోటోకాల్ పాటించని సంబంధిత అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోవా లక్ష్మీ కలెక్టరేట్ కార్యాలయం దగ్గర డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ బి ఆర్ ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.