జనం న్యూస్ 08 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
ఉద్యోగాల పేరిట నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసి నకిలీ అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మోసం చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. DSP శ్రీనివాసరావు వివరాల ప్రకారం…
వివిధ శాఖల్లో ఉద్యోగాలిస్తామని ఏడుగురి నుంచి నగదు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. 9 మంది నిందితుల్లో విజయనగరం(M) చెల్లూరుకి చెందిన చెక్క మహేశ్, రూబిన్ (జంగారెడ్డి గూడెం), జాన్, యాకూబ్ (ఏలూరు)ను శనివారం అరెస్ట్ చేశారు.