జనం న్యూస్ తర్లుపాడు మండలం. జూన్ 9
తర్లుపాడు మండల కేంద్రం అయిన తర్లుపాడు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వతరగతి చదివిన మాదాల నాగ సురేష్ 576 మార్కులు సాధించి ప్రతిభా పురష్కారానికి ఎంపిక అయినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం సుధాకర్ బాబు తెలిపారు, అవార్డు ను ఒంగోలు లో కలెక్టర్, మంత్రులు చేతులు మీదుగా 20 వేల నగదు, మెడల్ ను అందుకోనున్నట్లు తెలిపారు అవార్డు కు ఎంపిక అయినందుకు స్కూల్ చైర్మన్ వెన్నా రాజా రామ్ రెడ్డి, ఉపాధ్యాయులు అభినందించారు