జనం న్యూస్. జూన్8. సంగారెడ్డి జిల్లా.హత్నూర. నియోజకవర్గం .ఇంచార్జ్ (అబ్దుల్ రహమాన్)
విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన ఆదివారం నాడు మండల కేంద్రమైన హత్నూర గ్రామ శివారులోగల ఒక వ్యక్తి వ్యవసాయ క్షేత్రంలో చోటు చేసుకుంది. హత్నూర గ్రామానికి చెందిన మంగలి నర్సింలు అనే రైతు తన వద్ద ఉన్న రెండు ఎడ్లను మేత కోసం తీసుకెళ్లాగా.అక్కడే ప్రమాదపు టంచులో కిందకు వేలాడుతున్న విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ తీగలు తగిలి ఒక ఎద్దు మృతి చెందినట్లు బాధితుడు వాపోయాడు.గత వారం రోజుల క్రితం వడ్డీకి అప్పు తెచ్చి టేక్మాల్ పశువుల సంతలో ఒక లక్ష యాభై వేల రూపాయలు వెచ్చించి రెండు ఎడ్లను కొనుగోలు చేశానని. అందులో నుండి ఒక ఎద్దు విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందిందని కంటతడి పెడుతూ లోనికి గురయ్యాడు.ఒక దిక్కు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ల వద్ద అధికారులు ఎలాంటి భద్రత ఏర్పాట్లు చేయకపోవడం.వ్యవసాయ పొలాల వద్ద ప్రమాదకరంగా విద్యుత్ తీగలు కిందికి వేలాడుతున్నాయని పలుమార్లు విద్యుత్ అధికారులతో మొరపెట్టుకున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తూ పట్టించుకోవడం లేదని స్థానిక రైతులు గ్రామస్తులు మండిపడ్డారు. నిరుపేద కుటుంబానికి చెందిన బాధిత రైతు మంగలి నర్సింలు కుటుంబీకులకు ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.