బిచ్కుంద జూన్ 9 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద గ్రామంలో సోమవారం జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను పాఠశాలలో చేర్పించుటకు ఇంటింటి ప్రచారం చేశారు. ప్రధానోపాధ్యాయురాలు జి. శారద మాట్లాడుతూ పాఠశాలలో మంచి నైపుణ్యం, ఉన్నత విద్యార్వతాలు కల ఉపాధ్యాయులు ఉన్నారని పిల్లలకు అన్ని విధాల విద్య సంబంధమైన విషయాలు వ్యక్తిత్వ వికాసం అభివృద్ధి చెందించుటకు అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు .ఇటీవల SSC ఫలితాలలో మండల్ టాపర్గా రావడం జరిగింది. అదేవిధంగా విద్యార్థులను వివిధ పోటీపరీక్షలకు సంసిద్ధులను చేస్తూ వారు మంచి ప్రయోజకులు అయ్యే విధంగా అన్ని విధాల వారికి సహాయము చేస్తామని తెలియజేశారు. ఇటీవల వెలువడిన నేషనల్ మెరిట్ కం స్కాలర్షిప్ పోటీ పరీక్షలో పవర్ సంజన విద్యార్థి సెలెక్ట్ కావడం మనందరికీ గర్వకారణం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు టి. మనోహర్ బి.దేవరావు, గంగారం మరియు సంగీత మేడం తదితరులు పాల్గొన్నారు.