రేషన్ పంపిణిని, అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన …..జిల్లా అదనపు కలెక్టర్
జనం న్యూస్ జూన్ 10 నడిగూడెం
భూ భారతి చట్టం ద్వారా భూ సమస్య లకి పరిష్కారం లభిస్తుంది కాబట్టి ఇట్టి అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేయనుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు. మంగళవారం నడిగూడెం మండలం లోని రత్నవరం గ్రామం జరుగుతున్న రెవిన్యూ సదస్సులో అదనపు కలెక్టర్ పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో నిర్వహించిన రెవిన్యూ సదస్సు ద్వారా 113 ధరఖాస్తులు సమర్పించారని తెలిపారు. రెవిన్యూ సదస్సులలో రైతులు తమ భూములకి సంబందించి అన్ని సర్టిపికెట్లు జత చేసి భూ సమస్యలను ధరఖాస్తు రూపంలో సమర్పించాలని తదుపరి అధికారులు క్షేత్రస్థాయి లో విచారణ చేసి సమస్య పరిష్కరించటం జరుగుతుందని తెలిపారు.అనంతరం గ్రామంలోని రేషన్ దుకాణంను అదనపు సందర్శించి ప్రజలు ఇబ్బందిపడకుండా ప్రభుత్వం ఆదేశాల ప్రకారం సన్నబియ్యం మూడు నెలలకి సరిపడేవి ఒక్కేసారి పంపిణి చేయాలని రేషన్ డీలర్ ను ఆదేశించారు. సన్న బియ్యం నాణ్యత బాగున్నాయా అని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. తదుపరి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి వేసవి సెలలు అనంతరం పునః ప్రారంభం అవుతున్నాయి కాబట్టి పరిసరాలు పరిశుభ్రంగా చేయాలని అన్నారు. రేషన్ సరుకులు వ్యాలిడిటీ తేది పరిశీలించి పిల్లలకి అందించే పోషక ఆహారం లో నాణ్యత పాటించాలని అదనపు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డివో సూర్యనారాయణ, తహసీల్దార్లు సరిత, హిమబిందు, సీనియర్ అసిస్టెంట్ కళ్యాణి, ఆర్ఐ రాంబాబు,కార్యదర్శి శ్రీను, అంగన్వాడీ టీచర్ కమలమ్మ,రేషన్ డీలర్ కిరణ్,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.