ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఎమ్మెల్యే విజయ్ కుమార్
జనం న్యూస్,జూన్11,అచ్యుతాపురం:
ఎలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలం వెంకటాపురం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే
సుందరపు విజయ్ కుమార్ జనవాణి కార్యక్రమం నిర్వహించి అచ్యుతాపురం మండలంలో ఉన్న ప్రజల సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించారు.సమస్యలు పై వచ్చిన ఫిర్యాదుల విషయమై వెంటనే ఎమ్మెల్యే సంబందిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కార మార్గాలపై చర్చించి త్వరితగతిన పరిష్కారం చూపించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.