జనం న్యూస్ జూన్ 11 ముమ్మిడివరం ప్రతినిధి
జూన్ 9 2025 నాటికి కేంద్ర ప్రభుత్వం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల వద్దకు కేంద్ర పథకా ప్రయోజనాలను అధిక సంఖ్యలో ప్రజలకు అందించడం మరియు సేవా సూపర్ పాలన పేదల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర జిల్లా ఆదేశాలు అనుసారం ముమ్మిడివరం రూరల్ మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో రామాలయం వద్ద అసెంబ్లీ కన్వీనర్ గోల కోటి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో సమావేశం జరిగినది గ్రామ వెల్ఫేర్ అసిస్టెంట్ తోట నాగసాయి చరణ్ మహిళలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నుండి వచ్చే పథకాలను వివరించి ఈ కార్యక్రమ జిల్లా కన్వీనర్ గనిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మహిళా పక్షపాతి ప్రధానమంత్రి మోడీ అని మహిళలు అభివృద్ధి చెందితే గ్రామం రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుందని మన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన అందుచేతనే మహిళకు 33% రిజర్వేషన్ ఎన్డీఏ ప్రభుత్వం ఆమోదించినది దీనివలన రాబోయే కాలంలో చాలామంది మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలరని అన్నారు ఆ తర్వాత మహిళలు రోజు యోగా చేయాలని యోగ చేయడం వలన కలు లాభాలను మహిళలకు వివరించారు ఆ తర్వాత వెల్ఫేర్ అసిస్టెంట్ మహిళ చేత యోగా చేయించడం జరిగినది గోలకోట వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ మన గ్రామంలో రోజు యోగ చేసుకునే వారికి నేను ఫ్రీ గా నేర్పిస్తాను అని అన్నారు ఈ కార్యక్రమంలో డ్వాక్రా యామినేటర్ గోడి అరుణ అలాగే డ్వాక్రా గ్రూప్ ప్రెసిడెంట్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు