పల్లె పొంగు విజయ్ కుమార్ బహుజన్ సమాజ్ పార్టీ కార్యదర్శి
భద్రాద్రి కొత్తగూడెం క్రైమ్
10జూన్ ( తెలంగాణ పత్రిక)
కొత్తగూడెం పట్టణంలోని బీసీ భవనం నందు ఉదయం 11 గంటలకు బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమీక్ష సమావేశం సభాధ్యక్షులు పల్లెటూరు తడికమల్ల శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పల్లె పొంగు విజయ్ కుమార్ హాజరై మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టారు కేంద్రంలో బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తూ వన్ ఇండియా వన్ నేషన్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు అడవుల నుండి ఆదివాసులను వెళ్ళగొట్టడానికి అక్కడున్నటువంటి కన్జ సంపదను కార్పొరేటర్లకు దోచిపెట్టడానికి రాజ్యాంగానికి విరుద్ధంగా ఆపరేషన్ కాగార్ పేరుతో ఆదివాసీల ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని నరమేధం సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి అనే చట్టం తీసుకవచ్చి ప్రజల భూములను లాక్కుంటున్నారని ఆరోపించారు రాష్ట్రంలో సరియైన విద్య వైద్యం ప్రజలకు అందించడంలో విఫలమయ్యారని మంచి విద్యను అందిస్తున్న గురుకులాలను గౌలిదొడ్డి లోని సోషల్ వెల్ఫేర్ గురుకులాలను సైతం చిన్నాభిన్నం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు విద్య అందని ద్రాక్ష లాగా నీరుగా అరుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కొత్తగూడెం నియోజకవర్గ అధ్యక్షులు కురిమిళ్ళ శంకర్ , జిల్లా ప్రధాన కార్యదర్శి సామల ప్రవీణ్ భద్రాచల నియోజకవర్గ అధ్యక్షులు ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు పినపాక నియోజకవర్గం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు