జనం న్యూస్ ;11 జూన్ బుధవారం ;సిద్దిపేట నియోజికవర్గం ఇన్చార్జి వై.రమేష్;
ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలతో పాటు వారి తల్లితండ్రులను సన్మానించే నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన సిద్దిపేట జిల్లా యాదవులు .ఈనెల 12 గురువారం రోజున మధ్యాహ్నం రెండు గంటలకు పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో ఉత్తమ ప్రతిభ పురస్కారాలు అందజేస్తున్నట్లు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ యాదవ విద్యావంతుల వేదిక సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గొర్రె మల్లికార్జున్ యాదవ్ శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్ అధ్యక్షులు బైరి రాములు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి వర్యులు స్థానిక ఎం ఎల్ ఏ శ్రీ తన్నీరు హరీష్ రావు, అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు చింతల రవీంద్ర నాథ్ యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చలకాని వెంకట్ యాదవ్ తదితర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. అఖిల భారత యాదవ మహాసభ, శ్రీకృష్ణ యాదవ ఫంక్షన్ హాల్, యాదవ విద్యావంతుల వేదిక, యాదవ ఎంప్లాయిస్ సొసైటీ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇట్టి కార్యక్రమానికి పదవ తరగతిలో 540పైగా, ఇంటర్మీడియట్ లో 940 పైగా మార్కులు సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచిన యాదవ విద్యార్థులతో పాటుగా, తల్లిదండ్రులు మరియు యాదవ ప్రజాప్రతినిధులు, యాదవ సంఘాల అధ్యక్షులు, ఫంక్షన్ హాల్ సభ్యులు అందరూ హాజరై విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పయ్యావుల ఎల్లం యాదవ్ బాగు యాదగిరి యాదవ్, బాల్ నర్సయ్య యాదవ్, అనీల్ కుమార్ యాదవ్,ఉండ్రాళ్ళ రాజేశం యాదవ్, చంద్రశేఖర్ యాదవ్, రాజు యాదవ్, మధు యాదవ్, కుక్కల తిరుపతి యాదవ్, బీరకాయల శ్రీశైలం యాదవ్, కుంచం శ్రీనివాస్ యాదవ్, బైరి కొమురయ్య యాదవ్, నల్ల వెంకటేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.