జనం న్యూస్ జాన్ 12(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)
బీటీ 3 పత్తి విత్తనాలు వెయ్యవద్దని వాటిని అమ్మినా, కొన్న నేరమే అని మునగాల మండల వ్యవసాయ అధికారి రాజు అన్నారు. బుధవారం మునగాల మండల పరిధిలోని పలు గ్రామాలలో పత్తి విత్తనాలు అమ్ముతున్న డీలర్ దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది రైతులు ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వం చే నిషేధించబడిన బీటీ 3 కత్తి విత్తనాలను కొనుగోలు చేసి పొలాల్లో నాటుతున్నారని, ఆ విధంగా బీటీ 3 పత్తి విత్తనాలను కొనడం, గ్రామాల్లో ఉన్నవారికి ఇవ్వడం, విత్తనాలు నాటడం అన్నీ కూడా చర్చరీత్యా నేరమని, బీటీ 3 పత్తి విత్తనాలు నాటిన వారికి, ఆ పొలాల్లో పనిచేసిన వారందరికీ కూడా క్యాన్సర్, చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉందని. కూలి పని చేసేవారు కూడా బీటీ 3 పత్తి విత్తనాలు పెట్టడానికి వెళ్ళవద్దని, వెళ్లి ఆరోగ్యం అనారోగ్యం పాలు చేసుకోవద్దని అన్నారు. ఇప్పటికే ఎవరు అయినా వేసిన వారి పొలాల్లో కలుపు తీయడానికి కానీ మందు వేయడానికి కానీ, పత్తి తీయడానికి కానీ ఎవరు వెళ్ళవద్దని,వెళ్లి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దని అన్నారు. ఈ బీటీ 3 విత్తనాల వల్ల రైతులు, కూలీలు, గ్రామస్తులు అనారోగ్య పాలయ్యే అవకాశం ఉందన్నారు. మీ గ్రామాల్లోని ఎవరైనా వ్యక్తులు కానీ, లేదా బయటనుంచి వచ్చిన వ్యక్తులు కానీ, బీటీ 3 విత్తనాలను అమ్ముతున్నట్లుగా లేదా కొంటున్నట్లుగా తెలిస్తే మునగాల వ్యవసాయ శాఖ సిబ్బందికి కానీ మునగాల పోలీస్ శాఖ వారిపై సమాచారం ఇచ్చి మీ గ్రామాన్ని కాపాడుకోవలసిందిగా రైతులకు సూచించారు. బీటీ 3 పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించిందని ఈ పత్తి విత్తనాలు రైతులు ఎవరూ కూడా కొనుగోలు చేయవద్దని, వీటివల్ల మానవాళికి ఎంతో ప్రమాదమో అవకాశం ఉందని రైతులు ఎవరు బీటీ 3 విత్తనాలను వేయకూడదని రైతులకు సూచించారు.