జనం న్యూస్ జూన్ 11 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపిచేడు మండలం బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా
అమ్మ మాట అంగన్వాడి బాట ర్యాలీ , గృహ సందర్శన ద్వారా మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న పిల్లల ఇంటికి వెళ్లి, ప్రీస్కూల్ కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి వివరిస్తూ, అంగన్వాడిలో నమోదు చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగ్ బిర్యానీ ఈరోజు అంగన్వాడీ కేంద్రాలలో ప్రారంభించడం జరిగింది(గర్భవతులకి, బాలింతలకి, ప్రీ స్కూల్ పిల్లలకి) చివరగా తల్లులకి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ప్రీస్కూల్ కార్యక్రమాల గురించి వివరిస్తూ, ప్రీ స్కూల్ స్టాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆటపాట ద్వారా విద్య నేర్పిస్తారని చెప్పటం జరిగింది.ఈ సమావేశంలో, పంచాయతీ కార్యదర్శి (కృష్ణ గారు) ఏ ఎల్ ఎం ఎస్ సికమిటీ సభ్యులు, ప్రీ స్కూల్ పిల్లల తల్లిదండ్రులు, గర్భిణీ మరియు బాలింతలు అంగన్వాడి టీచర్(ప్రశాంతి) అంగన్వాడి హెల్పర్ (శ్వేత ) ఆశా వర్కర్స్, (పద్మ, సులోచన) కిశోర బాలికలు, ఐసిడిఎస్ సూపర్వైజర్, (సంతోషిమాత) పాల్గొనడం జరిగింది