బిచ్కుంద జూన్ 11 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం గోపనపల్లి గ్రామంలో నాయబ్ తాసిల్దార్ భారత్ భూభారతి సదస్సులో పాల్గొన్నారు మల్కాపూర్ గ్రామంలో తాసిల్దార్ వేణుగోపాల్ రాజుల గ్రామంలో గిర్ధవర్ రవీందర్ పాల్గొన్నారు. ఈ భూభారతి సర్వే మండలంలో మూడవ తేదీ నుండి ఈనెల 20వ తేదీ వరకు కొనసాగుతుందని రైతులు దీన్ని సద్వినియం చేసుకోవాలని తాసిల్దార్ వేణుగోపాల్ వెల్లడించారు. గోపనపల్లి గ్రామంలో భూభారతి సదస్సులో 12 దరఖాస్తులు వచ్చినాయని తెలిపారు.అలాగే రాజుల గ్రామంలో 11 దరఖాస్తులు వచ్చాయి మల్కాపూర్ రెండు దరఖాస్తులు వచ్చాయి మొత్తము 25 దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని తాసిల్దార్ తెలిపారు,