జనం న్యూస్ 14 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుంటు బోయిన కూర్మారావు యాదవ్ అన్నారు అహ్మదాబాద్ లోని మేఘాని నగర్ లోని BJ మెడికల్ కాలేజీ మెస్ పై విమానం కూలడం తో విమానం లోని ప్రయాణికుల తో పాటు మెస్ లోని దాదాపు 20 మంది మెడికోలు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతి కి గురిచేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ కుటుంబాలకు అండగా ఉండాలని, అదే విధంగా క్షతగాత్రులకి వెంటనే సరైన వైద్య సదుపాయం అందించాలని కోరుకుంటున్నాను.వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆ బాధిత కుటుంబాలకు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను అన్నారు. విజయనగరం