జనం న్యూస్,జూన్14,అచ్యుతాపురం
:ప్రపంచ రక్త దాతల దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని ప్రజలకు రక్తం విలువని తెలపాలనే ఉద్దేశంతో ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఏటా జూన్ 14న నిర్వహిస్తున్నారు.అందులో భాగంగా హరిపాలెం- ఆందలాపల్లి శ్రీ సత్య సాయి భజన మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్పంచ్ మారిశెట్టి సూర్య నారాయణ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు.అనకాపల్లి ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ వారీ సౌజన్యంతో ఈ శిబిరానికి 25 మంది స్వచ్చందంగా వచ్చి రక్తదానం చేశారని, కాండ్రేగుల వెంకట అప్పారావు 29వ సారి రక్తదానం చేశారని శబరి నిర్వహకులు కర్రి ఆది నాగేశ్వరరావు తెలిపారు.ఈ శిబిరంలో అనకాపల్లి జిల్లా సత్యసాయి సేవా సంస్థల అధ్యక్షులు కసిరెడ్డి అప్పలనాయుడు,రామారావు,పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.