జనం న్యూస్- జూన్ 14- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-
ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు స్థానిక కమల నెహ్రూ ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరంలో రక్త దాతలకు మహారాజుల సేవా సంఘం సభ్యులు జి బద్రి, కె పుల్లారావు,
కె నకులరావు, రాందాస్ ల ఆధ్వర్యంలో పండ్లు, గుడ్లు, బిస్కెట్లు, ఫ్రూటీలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మహారాజుల సేవా సంఘం అధ్యక్షుడు జి బద్రి మాట్లాడుతూ 1901వ సంవత్సరంలో ఆస్ట్రేలియా కు చెందిన నోబెల్ విజేత కార్ల్ లాండ్ స్టీనర్ మొదటిసారిగా రక్తాన్ని వర్గీకరించారు,దీంతో ఆయన జయంతి కి గుర్తుగా రక్తదాతల దినోత్సవం జరుపుకుంటున్నామని మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 2004లో అన్ని దేశాల్లో నిర్వహించారని తెలిపారు,అన్ని దానాలలో కెల్లా రక్తదానం ఎంతో గొప్పదని రక్తదానం చేయడం వల్ల ప్రాణాలు కాపాడటమే కాకుండా మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని అత్యవసర పరిస్థితుల్లో సరైన సమయంలో రక్తం అందుబాటులో లేక ఎన్నో ప్రాణాలు పోతున్నాయని కావున ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని రక్త దానం చేయడం ప్రాణాపాయ స్థితిలో ఉన్న నిండు ప్రాణాలను రక్షించడం లాంటిదని ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేసి ప్రాణాలు నిలపాలని నేటి యువత ఇటువంటి రక్తదాన శిబిరాల్లో పాల్గొని స్వచ్ఛందంగా రక్తం దానం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మహారాజుల సేవా సంఘం అధ్యక్షులు జి బద్రి, సభ్యులు పుల్లారావు, నకులరావు, రాందాస్ , కారంపూడి శివ, శంకర్ తదితరులు పాల్గొన్నారు.