జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
సాధన యువజన సంఘం అధ్యక్షుడు దుర్గా ప్రసాద్కు ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా శనివారం సత్కారం చేశారు. విజయనగరంలోని ఓ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో అత్యధికంగా 66 సార్లు రక్తదానం చేయడమే కాకుండా పలువురు యువకులను రక్తదాతలుగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషిస్తున్న దుర్గా ప్రసాద్కు పలువురు చేతుల మీదుగా ఘన సత్కారం జరిగింది.