విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 15 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
గంజాయి అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగంకు పాల్పడి, జిల్లాలో పట్టుబడిన కేసుల్లో, అరెస్టుకాబడిన
నిందితులు సంపాదించిన అక్రమ ఆస్తులను ఫ్రీజ్ చేసేందుకు చర్యలు చేపుతున్నట్లుగా జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ జూన్ 14న తెలిపారు. గంజాయి అక్రమ రవాణ నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వ ఆదేశాలతో ఈ తరహా కేసుల్లో మరింత లోతైన దర్యాప్తు చేపడుతూ, వారు సంపాదించిన స్థిర, చరాలస్తులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలిస్తున్నామని, బాధ్యులైన వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ గంజాయి అక్రమ వ్యాపారులను హెచ్చరించారు. జిల్లాలో గంజాయి అక్రమ రవాణ, నిల్వలు, విక్రయాలు, వినియోగంకు పాల్పడే వ్యక్తులపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసామన్నారు. ఈ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులపై కేసులు నమోదు చేయడం కాకుండా, అందుకు బాధ్యులైన ప్రధాన నిందితులపై కూడా కేసులు నమోదు చేస్తున్నామన్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. గంజాయి అక్రమ రవాణ, వ్యాపారాలను నియంత్రించేందుకు వారు సంపాదించిన అక్రమ ఆస్తులను కూడా స్వాధీనం చేసుకునే ప్రక్రియను వేగవంతం
చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో నమోదైన గంజాయి కేసుల్లో అరెస్టుకాబడిన ప్రధాన నిందితుల బ్యాంకు ఖాతాలను, కొనుగోలు చేసిన వాహనాలు, భూములు, ఇండ్లను, ఇతర స్థిర, చరాస్తుల వివరాలను కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే ఎస్.కోట పోలీసు స్టేషనులో నమోదైన రెండు గంజాయి కేసుల్లో ఇద్దరు నిందితుల నుండి సుమారు రూ.2.5 కోట్లు ఆస్తులను ఫ్రీజ్ చేసామని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.విశాఖపట్నంలో నివాసం ఉంటున్న శెట్టి ఉమా మహేశ్వరరావు అలియాస్ హుస్సేన్ అలియాస్ పుతిన్ అనే వ్యక్తిపై ఇప్పటికే అల్లూరి సీతారామరాజు జిల్లా, విజయనగరం, విశాఖపట్నం సిటీ పరిధిలో ఏడు గంజాయి కేసులు నమోదైనట్లు, లాభసాటి వ్యాపారంగా భావించి, గంజాయి అక్రమ రవాణకు పాల్పడుతున్నట్లు, అతనికి కుటుంబ సభ్యుల పేరున వివిధ ప్రాంతాల్లో స్థలాలను కొనుగోలు చేసినట్లు, సంపాదించిన అక్రమ ఆస్తుల విలువ రూ.1,97,62,965/- ఉంటుందని గుర్తించి,నిందితుడి అక్రమ ఆస్తులను ఎవరికీ విక్రయించకుండా చట్ట పరిధిలో ఫ్రీజ్ చేసామని జిల్లా ఎస్పీ తెలిపారు. అదే విధంగా ఒడిస్సా రాష్ట్రం, కోరాపుట్ జిల్లా నందపూర్ మండలం, బసుపుట్ గ్రామం, సోబాపుట్ వార్డుకు చెందిన పతి ఖిల అలియాస్ గురు (32 సం.లు)కు చెందిన గత కొన్ని సంవత్సరాలుగా గంజాయి అక్రమ రవాణ చేస్తూ, వివిధ ప్రాంతాలకు గంజాయిని తరలిస్తున్నట్లు, వచ్చిన అక్రమ సంపాదనతో రూ.42,70,000/-ల విలువైన స్థిర, చరాస్థులను సంపాదించినట్లుగా గుర్తించి, వాటిని కూడా ఫ్రీజ్ చేసామన్నారు. గత రెండు సంవత్సరాల్లో జిల్లా పోలీసుశాఖ గంజాయి నియంత్రణకు విస్తృతంగా దాడులు నిర్వహిస్తూ, గంజాయి అక్రమ రవాణకు కఠిన చర్యలు చేపట్టిందన్నారు. గంజాయి అక్రమ రవాణకు పాల్పడిన వారిపై 2024 సం.లో 83 కేసులు నమోదు చేసి, 268మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 30వాహనాలను, 2,157 కిలోల గంజాయి, 78 గ్రాముల నల్లమందు సీజ్ చేసామన్నారు. అదే విధంగా 2025 సం. లో ఇప్పటి వరకు 52 కేసులు నమోదు చేసి,155 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుండి 346 కిలోల గంజాయి, 21 వాహనాలను సీజ్ చేసామన్నారు.ప్రజలందరూ చట్టాలను గౌరవిస్తూ, మాదక ద్రవ్యా రవాణ, అక్రమ రవాణ, విక్రయాలు, వినియోగానికి దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ తరహా వ్యాపారాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అక్రమ వ్యాపారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తీవ్రంగా హెచ్చరించారు.