జనం న్యూస్ ;15 జూలై ఆదివారం:సిద్దిపేట నియోజికవర్గ ఇన్చార్జి వై. రమేష్ ;ప్రకృతిలో ప్రతి వస్తువుపై రచన చేస్తూ తెలుగు సాహిత్యంలో ఎనలేని కీర్తి గడించిన కవి శ్రీరంగం శ్రీనివాసరావు బాటలో నవ కవులు సాగాలని బాలసాహితీవేత్త ఉండ్రాళ్ళ రాజేశం, యువకవి బస్వ రాజకుమార్ అన్నారు. శ్రీశ్రీ వర్ధంతి సందర్భంగా సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో నివాళులర్పించి వారు మాట్లాడుతూ సమాజానికి స్ఫూర్తినిచ్చే రచనలు, రచయితలను మరువకూడదన్నారు. ముఖ్యంగా శ్రీశ్రీ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడ్డారని, వారి బాటలో సాగాలన్నారు.