జనం న్యూస్, జూన్ 16, జగిత్యాల జిల్లా,
ఇబ్రహీంపట్నం మండలం : మండలంలోగాలా వేములకుర్తి గ్రామం లో ఈ రోజు గ్రామ దేవాదాయ కమిటి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకొని కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కమిటీలో భాగంగా చైర్మన్ గా నాంపెల్లి వెంకటాద్రి, వైస్ చైర్మన్ గా బాస మల్లేష్, కోశాధికారి గా నలిమెల రాజేందర్, రైటర్ గా రెడ్డవేన లక్ష్మీ నర్సయ్య ఎన్నికయ్యారు, ఈ కార్యక్రమం లో ఎన్నికైన సభ్యులతోపాటు ఆకుల శేఖర్, ఆరే లింగారెడ్డి, పోశెట్టి, రాజారపు రవి, కొబ్బాజి లక్ష్మీనారాయణ, కార్యవర్గ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు