జనం న్యూస్ 20 జూన్, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం కాంప్లెక్స్ వద్ద ప్రయాణికుల సెల్ ఫోన్లు, డబ్బులు దొంగలిస్తున్న వ్యక్తిని ఆర్టీసీ పోలీసులు గురువారం పట్టుకున్నారు. అతని నుంచి రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్ననాయుడు తెలిపారు. ప్రయాణాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.