బీజేపీ గ్రామ అధ్యక్షులు సత్యనారాయణ
జనం న్యూస్, జూన్ 24 ( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్ )
జగదేవపూర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారని తిగుల్ నర్సాపూర్ గ్రామ బిజెపి పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ ముదిరాజ్ అన్నారు.సోమవారం శ్రీ కొండపోచమ్మ దేవాలయం వద్ద ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్లు అర్హులైన నిరుపేదలకు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముడుపులు అప్పజెప్పిన ఇస్తున్నారన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రధానమంత్రి అవాస్ యోజన పథకం కింద ఇస్తున్న ఇండ్ల ను అర్హులందరికీ ఇస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమే పూర్తిగా ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు,ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో అవినీతి అక్రమాలను అరికట్టి అర్హులకు ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వన్ని డిమాండ్ మండలం లో ఇందిరమ్మ ఇళ్ల అనర్హులకు కేటాయించారని తెలిపారు,కాంగ్రెస్ పార్టీ అనుచరులకు కార్యకర్తలకే ఇండ్లు కేటాయించి అర్హులైన పేదలకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ గ్యారంటీల వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల కోసం ప్రజలను మభ్యపెడుతుందని దుయ్యపట్టారు, అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు,కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకున్నారని గుర్తు చేశారు. గ్రామాల్లో చాలా మంది నిరుపేదలు గూడు లేక వర్షాకాలంలో గుడిసెలకు కవర్లు కప్పుకుని జీవనం కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో ఇస్తామని నేడు తీరా చూస్తే పేదలకు ఇందిరమ్మ ఇళ్లు అందని ద్రాక్షగా మారిందని తెలిపారు. చిన్న వయసులో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి గూడు లేక అద్దె ఇళ్లలో పిల్లలతో బతకుబండిని కొనసాగిస్తున్న వారిని కాంగ్రెస్ ప్రభుత్వం మరిచిపోయిందని వాపోయారు. అలాగే ఏళ్ల తరబడిగా ఎట్టి కష్టాలు చేస్తూ కూలీన పెంకుటిల్లు, పూరి గుడిసెలో బతుకులు వెళ్లదీస్తున్న గరీబోళ్ల సొంతింటి కళ కలగానే మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్థికంగా ఉన్నవారికి కాకుండా పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అర్హులకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వకపోతే వారి పక్షాన నిలబడి ఇళ్లు వచ్చే వరకు ఉద్యమిస్తామని తెలిపారు.మాట ఇచ్చి తప్పడం కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు,